ప్రభాస్ :
బాహుబలిగా దేశానికే కాకుండా ప్రపంచానికే పరిచయమైన పర్సనాలిటీ ప్రభాస్ ది. కృష్ణం రాజు తమ్ముడి కొడుకుగా తెరంగేట్రం చేసిన ప్రభాస్….పెదనాన్న రెబల్ బిరుదును స్వీకరించి రెబల్ స్టార్ గా తెలుగు ఇండస్ట్రీని ఊపేస్తున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోని ప్రభాస్ ప్రతి సినిమాకు 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని సమాచారం.
నాగార్జున:
అన్నపూర్ణ స్టూడియోస్ ను కలిగిన నాగార్జున కు బెంగుళూరు లోని లావిష్ ప్రాపర్టీస్ తో పాటు అనేక ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి.నాగ్ ఆస్తులు దాదాపు 3000 కోట్లు ఉంటాయని అంచనా!? ఆయన ఇద్దరు కుమారులు కూడా సినీరంగంలోనే ఉన్నారు.
చిరంజీవి:
సుప్రీం హీరోగా ప్రేక్షకులను అలరించిన చిరంజీవి, తర్వాత ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు, తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా విదులు నిర్వహించారు.
మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమాకు 18 కోట్లకు మేర పారితోషకం తీసుకుంటారని సమాచారం. బాలనటుడిగా ఆరంగేట్రం చేసిన మహేష్ కొద్ది కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో స్థానం సంపాదించాడు.
అల్లు అర్జున్:
2015 పోర్బ్స్ పత్రిక ప్రకారం దేశ వ్యాప్తంగా టాప్ 50 ఎర్నింగ్ సెలెబ్స్ లో చోటు దక్కించుకున్నాడు అల్లు అర్జున్.. డాన్స్ లకు పెట్టింది పేరైన బన్నీ….. సోషల్ మీడియాలో కూడా హ్యూజ్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు.
పవన్ కళ్యాణ్:
ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్ లో ఉన్న హీరో పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన పవన్ అనతి కాలంలోనే ఆయనేంటో నిరూపించుకున్నాడు. జనసేన అధినేతగా కూడా సమాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నారు.