టి20ల్లో ఏనాడూ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోని భారత్ ఓడిపోయి ఏకంగా కప్నే కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో దినేశ్ కార్తిక్ తన క్రీడ నైపుణ్యాన్ని చాటుకున్నారు. భారత్ పరువు నిలబెట్టాడు. 8 బంతుల్లో 29 రన్స్ కొట్టి భారత్ ను గెలిపించి హీరోగా నిలిచాడు.
లెక్కకు స్కోరు తక్కువే అయినప్పటికి … కార్తిక్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో మ్యాచ్నే మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 29 నాటౌట్. ఆయన 8 బంతుల్లో 6, 4, 6, 0, 2, 4, 1, 6 కొట్టి దేశానికి విజయాన్ని సాధించి పెట్టారు. భారత్కు ఒంటిచేత్తో నిదహస్ ట్రోఫీని అందించాడు కార్తిక్. బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షబ్బీర్ రహమాన్ (50 బంతుల్లో 77; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. యజువేంద్ర చహల్ 3, ఉనాద్కట్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (42 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. రూబెల్ హొస్సేన్కు 2 వికెట్లు దక్కాయి. దినేశ్ కార్తీక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’… వాషింగ్టన్ సుందర్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత శ్రీలంక ఫాన్స్ ఎలా సంబరపడ్డారో చూడండి!
watch video here:
Posted by బతుకమ్మ on Monday, 19 March 2018